మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 10. బ్రిటిష్ పరిపాలనలో భారత దేశ ప్రజలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విముక్తి స్వతంత్రం, స్వేచ్ఛ, కొరకు ఎంతో మంది పోరాట ఫలితంగా స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్సరాలు కావస్తుంది.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవ మహోత్సవాలు మిన్నటుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ నయాగరా బొగత జలపాతం వద్ద మొక్కలు నాటారు. తదనంతరం టేకులగూడెం గ్రామంలో పర్యటించారు రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు టేకులగూడెం వద్ద జాతీయ రహదారి పై నీరు ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత ,ఎంపీపీ శ్యామల శారద, తహసిల్దార్, గూడూరు లక్ష్మణ్, ఫారెస్ట్ అధికారులు వీరాపురం సర్పంచ్, సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: