CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సి హాస్టల్ ను మల్లంపల్లి కి తరలించే ఆలోచన మానుకోక పోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం పల్లికొండ యాదగిరి

Share it:

మన్యం మనుగడ, మంగపేట : 

స్వార్ధ ప్రయోజనం కోసం ఎస్సి హాస్టల్ ను మల్లంపల్లి కి తరలించడం  తప్పు అని ఈ ప్రక్రియ మానుకోకపోతే దళితగిరిజన సంఘాలనుండి, బహుజనుల సంఘాలనుండి పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తా రోఖోలు చేపడతాం అని  దళిత సంఘాల నాయకుడు ఈ సందర్బంగా తెలియజేశారు.మంగపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి  మంగపేట మండల రాజుపేట లో మల్లంపల్లి ఎస్సి హాస్టల్ తరలింపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అధితిగా విచ్చేసిన పల్లికొండ యాదగిరి మాట్లాడుతూ మంగపేట మండలం లోని ఎక్కువ మంది పిల్లలు ఉండటం తో  దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా ఉన్నందున  జనాభా ఆధారంగా ప్రణాళిక చేసి మండలానికి కేటాయించిన ఎస్సి హాస్టల్ ని కొంతమంది అధికారుల స్వార్ధ ప్రయోజనం కోసం మలంపల్లి కి తరలించాలి అనే ఆలోచన మంచి పద్ధతి కాదు అని  ఎస్సి హాస్టల్ ఇదే మండలం లో ఉంటే మండల దళిత విద్యార్థులకు ఆసరా గా అనుకూలంగా ఉంటుంది అని, తరలించాలి అనే ఆలోచన మానుకోవాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ గౌరవ ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ సభ్యురాలు సీతక్క ఆధ్వర్యంలోసైతం ధర్నా నిరసన కార్యక్రమలు చేస్తాం అని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సి సెల్ నాయకులు కర్రీ చిన్నపుల్లయ్య జంగం దావీదు గోగులముడి దానియేలు,జంగం జయందస్ కర్రీ పుల్లయ్య జంగం శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: