జూలూరుపాడు ఆగస్టు 3, (మన్యం మనుగడ ప్రతినిధి) :
మండల పరిధిలోని మాచినేనిపేటతండా గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలలోకి వెళ్తే లాకావత్ లచ్చు నాయక్, అతని భార్య లక్ష్మి ఇరువురు హెల్త్ చెకప్ కోసమని ఇంటికి తాళం వేసి సోమవారం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న 1 లక్ష 50 వేలు నగదు, సుమారు మూడు తులాల బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. స్థానిక సీఐ వసంత్ కుమార్ తన సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించి సంఘటన స్థలంలో వేలిముద్ర నమూనాలను సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Post A Comment: