CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మా పాఠశాల ను మల్లంపల్లికి తరలిస్తే మా పిల్లల భవిష్యత్ ప్రశ్నర్ధకమే.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉన్న గురుకుల పాఠశాలను కొంతమంది అధికారుల స్వార్ధ ప్రయోజనాల కోసం మల్లం పల్లికి తరలించాలని చూస్తున్నారని బిజెపి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈ పాఠశాల మంగపేట ఏటూర్ నాగారం, వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం, తాడ్వాయి మండలాలను దృష్టిలో పెట్టుకొని కేటాయించడం జరిగింది, ఈ మండలాలలో ఉన్న దళితులకు కేటాయించిన ఏకైక పాఠశాలను దూరం చేస్తున్నారని, దూర ప్రాంతాలకు పంపించలేని స్థితిలో దళితులు ఉన్నారని ఇకనైనా ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు.స్వార్థ ప్రయోజనాల కోసం తరతరాల దళితుల బ్రతుకులు చదువుకు దూరం చేసి చీకటిమయం చేయవద్దని బిజెపి నాయకులు ఈ సందర్బంగా కోరారు. మల్లంపల్లి కి గురుకుల పాఠశాల తరలించే ఆలోచన మానుకోవాలి,లేనిపక్షంలో బిజెపి పార్టీ నుండి ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు, దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రామటెంకి సమ్మయ్య, దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ, దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు కావేరి నారాయణ, బోర్ నరసాపురం బూత్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: