దమ్మపేట ఆగస్ట్ 04 ( మన్యం మనుగడ ) : పట్వారిగూడెం రైతు వేదిక వద్ద దమ్మపేట మండల ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జెఎసి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఆగష్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు ప్రతి గ్రామంలో ఆదివాసీ జెండాను ఎగరవేసి తర్వాత అందరూ కలిసి దమ్మపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ అనంతరం ఆదివాసీ జెండా ఎగురవేయడం జరిగుతుంది. కావున గ్రామపంచాయతీలో నుండి ఆదివాసీ మిత్రులందరూ మండల కేంద్రానికి భారీగా తరలివచ్చి ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి రాష్ట్ర కార్యదర్శి కొరసా దొర,సీనియర్ నాయకులు, మండలంలోని గ్రామపంచాయితీల సర్పంచులు యువకులు పాల్గొన్నారు.
Post A Comment: