మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ కొర్సాలక్ష్మిరుపావతి ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. బిడ్డ పుట్టినప్పుడు వచ్చే ముర్రుపాల ప్రాముఖ్యత గురించి అంగన్వాడీ కార్యకర్తలు వివరించడం జరిగింది. ముర్రు పాలు బిడ్డ తాగినట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి బిడ్డ వ్యాధి బారిన పడే అవకాశం ఉండదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కొర్సా ప్రమీల, పాయం కుమారి, ఏనిక కుమారి, పల్లె నరసింహరత్నం, పాఠశాల ఉపాధ్యాయుడు కొమరం రమేష్, ఆశ కార్యకర్త మెండు తులిశమ్మ , తల్లులు , పిల్లలు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: