మన్యం టీవీ దుమ్ముగూడెం ::
తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీవేజి వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మె పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మండల పరిధిలోని ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్స్ యూనియన్ ఆదేశాల మేరకు సమ్మె చేస్తున్నారు అనంతరం వారి డిమాండ్లను తెలుపుతూ పి ఎం హెచ్ వర్కర్స్ 14 నెలలు డైలీ వర్కర్స్ 9 నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరణించిన వర్కర్ కుటుంబంలో ఒకరికి డైలీ వర్కర్ గా నియమించాలని ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో వర్కర్లు సత్యనారాయణ వెంకటేశ్వర్లు నాగమణి పాల్గొన్నారు
Post A Comment: