మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం రాజుపేట శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ రామకృష్ణ మల్లంపల్లి మండల సాధన సమితి కి స్వయంగా వెళ్లి తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా బాడిశ రామకృష్ణ మాట్లాడుతూ మల్లంపల్లి మండలం కావాలి అని ప్రజలు ఎన్నో సంవత్సరాలనుండి వివిధ రకాలుగా తమ మండలం అవసరాన్ని తెలియజేస్తున్నారు, మండలం అనేది ప్రజల సౌకర్యార్ధం అంతే కానీ ఎవరి స్వలాభం కోసం కాదు, అటువంటి ధర్మమైన కోరికను ప్రభుత్వం తప్పనిసరిగా వారి సౌకర్యం మేరకు వెంటనే మండలం ఏర్పాటు చేయాలి, మల్లంపల్లి కి మండలం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అందువలన ప్రభుత్వం మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పది జిల్లాలు ఉన్న తెలంగాణా ను 33 జిల్లాలు చేసింది ప్రజా సౌకర్యం మేరకు అనుకున్నప్పుడు, గ్రామాలు, జనాభా ఆధారంగా కూడా మండలం చేయడం ప్రజల అవసరం మేరకు, సౌకర్యం మేరకు వారి సమస్యలను తీర్చేందుకు అని ప్రభుత్వం గ్రహించాలి అని ప్రభుత్వానికి విన్నవిస్తూ మల్లంపల్లి మండలం కావాలి అనేది ఇప్పుడు పుట్టిన డిమాండ్ కాదు గత కొన్ని సంవత్సరాలనుండి ప్రజలు కోరుతున్నారు కాబట్టి మన శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ తరపున మేము మల్లంపల్లి మండలం సాధన సమితి కి మద్దతు తెలుపుతున్నాము అని తెలియజేశారు.
Post A Comment: