మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు అధ్యక్షత వహించగా, స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, రంగోలి వంటి కార్యక్రమాలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: