CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తక్షణమే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. -మలిదశ ఉద్యమకారులు షేక్ ముబారక్ బాబా

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: 

 ఉద్యమకారుల సంక్షేమ బోర్డు చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్  ఉమ్మడి జిల్లా ఉద్యమ కారుల  అధ్యక్షులు డాక్టర్ కె వి కృష్ణారావు పిలుపుమేరకు  ఉద్యమకారులు సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ స్థానిక ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయము నందు ''యాభై పైసలు ఐదు నిమిషాలు" అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు పోస్ట్ కార్డు ద్వారా వినిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యమ కారుడు ముబారక్ బాబా మాట్లాడుతూ పది వేల కోట్ల బడ్జెట్ తో తెలంగాణ సంక్షేమ బోర్డుని తక్షణమే ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులకి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందజేయాలని ఉద్యమకారుల ఆత్మగౌరవం చాటి చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను అన్ని విధాలుగా ఆదుకొని, సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: