CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవా వేడుకలలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ

Share it:

మన్యం మనుగడ, అశ్వారావుపేట: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలోని వివద ప్రదేశాల్లో మొక్కలు నాటిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, నెహ్రూ నగర్, పోలీస్ స్టేషన్ పలు ప్రదేశాలలో మొక్కలు నాటడం జరిగిందని ఆయన తెలిపారు. భారత స్వాతంత్ర్య ద్విసాప్తహం వేడుకలలో భాగంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటడం జరిగిందని, ఇప్పటికే హారిత హారం, పేరిట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పటికే అటవీ శాతం పెరిగిందని ఇలా మొక్కలు నాటడం వలన ఆక్సిజన్ శాతం పెరిగి, మానవాళి మనుగడకు ఆరోగ్యానికి మంచి జరుగుతుందని, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మన మన వంతుగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సంధర్బంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహ్మాన్, ఎస్ఐ చల్లా అరుణ, సిడిపిఓ  రోజారాణి, ఈసీ నరేష్, సూపర్వైజర్ విజయలక్ష్మి, సూపర్డెంట్ ప్రసాద్, యూడిసి శ్రీనివాస్, ఈఓ హరికృష్ణ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: