మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని జానంపేట గ్రామపంచాయతీ సుందరయ్య నగర్ గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోదావరి వరద ముంపు బాధితులు అందరికీ నిత్యావసర సరుకులను అందజేసారు. దీనిలో భాగంగా బియ్యం 10 కేజీలు, కందిపప్పు 2 కేజీలు, శనగలు 2 కేజీలు, 2 జతల చెప్పులు, దోమతెర, 4 మాస్కులు, 1/4కేజి టీ పొడి, 1 దుప్పటి, 2 తల దిండ్లు ఇవ్వడం జరిగింది.సుమారు ఒక కిట్టు విలువ 3వేల రూపాయల విలువ చేస్తుందని ఆధార్ సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని వ్యాధులనుండి కాపాడుకోవాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దొడ్డ బిక్షమయ్య, జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు , ఆధార్ సంస్థ సభ్యులు భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య, గ్రామస్తులు మడవి రమేష్, కురసం లక్ష్మయ్య, మడవి భీమరాజు, కోవాసి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: