మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయతీ గోపాలరావు పేట గ్రామంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ , మణుగూరు ఎక్సైజ్ సీఐ జే. రామ్మూర్తిలు హరితహారం లో భాగంగా ఆదివారం ఖర్జూర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌడ కులస్తులకు ఆసరా పెంపొందించేందుకు ఖర్జూర, తాటి, ఈత మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, చిర్రా వెంకన్న గౌడ్,కొత్త దామోదర్ గౌడ్,కొంపెల్లి మల్లేష్ గౌడ్ ,సంతోష్ గౌడ్,కోటి గౌడ్,శ్రీను గౌడ్,నాగేశ్వరరావు గౌడ్,చిర్ర కుమార్ గౌడ్,నాగేష్ గౌడ్,మల్లేష్ గౌడ్,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: