ములకలపల్లి :మన్యం మనుగడ ప్రతినిధి : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తెలంగాణా రాష్ట్ర రెండవ మాహాసభలు కొత్తగూడెం లో ఈ నెల 26-27-28 న జరగనున్నాయని 26 న విద్యార్థులభారీ ర్యాలీ, బహిరంగసభ ను జయప్రదం చెయ్యాలి అని ఎఐఎస్ఎఫ్ మండల నాయకులు గంటసాల సంతోష్ కోరారు.మండల కేంద్రం లో జరిగిన సమావేశం లో మాట్లాడుతూ విద్యార్థి సమస్యల పరిస్కారం కోసం ఎఐఎస్ఎఫ్ అనేక ఉద్యమాలు చేసిందని 1936 ఆగస్టు 12 దేశం లో ఆవిర్భవించిన తొలి విద్యార్థి సంఘమని తెలిపారు. బ్రిటిష్ వారు అవలంబిస్తున్న మోకాలే బానిస విద్యా విధానం వలన దేశం లో విద్యా వ్వవస్థ ప్రపంచ దేశాల తో పోటీ పడటం లేదని, నేటికీ పాఠశాల లకు పూర్తి స్థాయి లో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అందించటం లో ప్రభుత్వాలు వైఫల్యం చెందియని అన్నారు. టీచర్ కు టెస్ట్ బుక్స్ కూడా అందించ కుండా పాఠాలు ఎలా బోధిస్తారని,సిలబస్ ఎలా పూర్తి చేస్తారని విమర్శించారు.ఈ కార్యక్రమం లో ఎఐఎస్ఎఫ్ నాయకులు వరుణ్ ,శివాజీ,సునీల్,సంపత్,అన్వేష్,శ్రీ నాద్,ప్రశాంత్,రవి,సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: