మన్యం మనుగడ,పినపాక :
రాజకీయాల్లో యువకుల కీలకపాత్ర పోషించాలని టీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో జరిగిన మండల యూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు.
ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్,దాట్ల వాసుబాబు, కటకం గణేష్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్, యూత్ నాయకులు మనోజ్, సంతోష్, గంగయ్య, ఇర్పా సాంబశివరావు, సుమన్, సురేందర్, సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, శ్యామల సతీష్, వీరబాబు, బాలకృష్ణ, కేఎన్ఆర్, ప్రనీత్, కిషోర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: