గుండాల ఆగస్టు 24(మన్యం మనుగడ) నక్సల్ సమాచారం అందించి బహుమతి సొంతం చేసుకోండి అని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ అన్నారు. గురువారం నక్సల్స్ ను నిర్మూలిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం అని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోడ పత్రికలను అంటించారు. నక్సలైట్ వ్యవస్థ మూలంగా అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. జిల్లాలోని గ్రామాల్లో సంచరిస్తున్న నక్సల్ సమాచారం అందిస్తే 20 లక్షల వరకు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే పోలీస్ శాఖ సమాచారం ఇవ్వాలని కోరారు
Post A Comment: