మన్యం టీవీ దుమ్ముగూడెం ::
అన్నీ ఉండి అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది ములకపాడు ప్రాథమిక హాస్పటల్ లోని పరిస్థితి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం చే ఎన్ క్యాష్ గుర్తింపు పొందిన 24 గంటల ప్రధాన హాస్పిటల్ నిత్యం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎంతోమంది రోగులు వస్తుంటారు కానీ ఇక్కడ అందుతున్న వైద్యం, సిబ్బంది లేక మందులు కొరత ప్రైవేట్ మెడికల్ షాప్ కి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది అయితే ఈరోజు ఉదయం చెరుపల్లి, సింగవరం నుండి లక్ష్మీనగరం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులు గత రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ రాపాక చైతన్య ఓ పి రాసి మందులు బయట మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోవాలని సూచించారు ఇదేంటని డాక్టర్ ని వివరణ అడగగా తను అలా చెప్పలేదని ఎవరు మీకు చెప్పారు వాళ్ళని తీసుకురావాలని నిర్లక్ష్యం సమాధానం చెప్పారు. మందులు ఉంచుకొని కమిషన్ల కోసం ప్రైవేట్ మెడికల్ షాపుకు పంపించారా లేక నిజంగానే మందులు కొరత ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలానే రోగుల్ని పట్టించుకోకుండా సిబ్బంది ముచ్చట్లు పెడుతున్నట్టు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post A Comment: