మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇంటింటిపై జాతీయ జెండాలు ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అశ్వరావుపేట గ్రామపంచాయతీ సిబ్బంది స్థానిక రింగ్ రోడ్ సెంటర్ లో మూడు రంగులతో విద్యుత్ దీపాలను అలంకరించారు దీనితో అశ్వరావుపేట స్థానిక రింగ్ రోడ్ సెంటర్ మువ్వన్నెల విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నది దీనితో స్థానిక రింగ్ రోడ్ సెంటర్కు కొత్త శోభ వచ్చిందని ప్రజలు పంచాయతీ వారిని కొనియాడుతున్నారు.
Navigation
Post A Comment: