మన్యం మనుగడ, పినపాక:
75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పినపాక మండలంలో భరతమాత ఖ్యాతి తెలిపే విధంగా మండల అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజానీకం చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమం చివరికి ఏడూళ్ళ బయ్యారం ఎక్స్ రోడ్ కి చేరుకోవడం జరిగింది. భరతమాతకు సంబంధించిన జాతీయ గీతాలాపన, నినాదాలతో ఎక్స్ రోడ్డు పరిసరాలు జాతీయతాభావంతో మార్మోగిపోయాయి. అదే సమయంలో ట్రాఫిక్ కు సంబంధించిన సమస్యలను ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్, ఎస్ ఐ టి వి ఆర్ సూరి ల ఆధ్వర్యంలో సిబ్బంది విజయవంతంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రమ కోర్చి తమ విధిని నిర్వర్తించారు. కార్యక్రమ విజయవంతంలో తమదైన పాత్ర పోషించిన ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖకు సలాం పోలీస్ అని ప్రజానీకం అభినందనలు తెలిపారు
Post A Comment: