మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సినిమా సెంటర్ నందు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం ర్యాలీని జెండా ఊపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జ అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాట విషయాల గొప్పతనం నేటి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు, మహనీయులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు.ఎన్నో ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో 75 ఏండ్ల కిందట స్వాతంత్రం సిద్ధించిందన్నారు. నాడు పోరాటాలు చేసిన త్యాగదనుల సేవలు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ 15 రోజులపాటు నిత్యం విభిన్నమైన కార్యక్రమాలు నిర్ణయించాలని నిర్ణయించారని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశంలో పాలన న్యాయ శాసన వ్యవస్థలతోపాటు ఇతర వ్యవస్థలు నడుస్తున్నాయని అన్నారు. భారత సంస్కృతిని ప్రజలలో నింపడం సహా అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా నినాదాలు చేస్తూ హోరెత్తించారు ఈనెల 22వ తేదీ వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
👉 ఈ కార్యక్రమంలో పినపాక మండలం చెందిన వందలాది మంది విద్యార్థులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, పలు విద్యాసంస్థల డైరెక్టర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: