మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామ పంచాయితీ లో సభలం చంద్రయ్య 60,000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,స్థానిక సర్పంచ్ మడకం సాదు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, నియోజవర్గగం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,చిలక వెంకటరమయ్య,తుమ్మల చెరువు సర్పంచ్ బాండ్ల సంధ్య,తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత,మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు,మండల మైనార్టీ అధ్యక్షులు నాయుమ్,కొండ్రు రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: