మన్యం మనుగడ కరకగూడెం: రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మెరకు భారత స్వాతంత్ర వజ్రోత్సవ లలో భాగంగా ఫ్రీడమ్ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించిన కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం, ఎంపీపీ రేగా కాళికా. ఈ ర్యాలీ ఎంపిడిఓ కార్యాలయం నుండి తాటిగూడెం వరకు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 75 ఏళ్ల వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా జాతీయ సమైక్యతను చాటుతూ సాగిన ఫ్రీడం ర్యాలీ, విదేశీ బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ 75 ఏళ్ళు గడుస్తున్న శుభ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా 15 రోజుల సంబరాలు, దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అదేశించారని అన్నారు.
ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేళ పరుగు పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, విద్యార్థినులు,విద్యాసంస్థల ఉపాధ్యాయులు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు, స్థానిక ప్రజలు, అధిక సంఖ్యలో భారీ ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: