మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి, బోటిగూడెం, ఉప్పాక,తోగ్గూడెం గ్రామాలలో 75 వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను చిన్నారుల, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించడం జరిగింది. చిన్నారులు జాతీయ జెండాలను చేత పట్టుకొని, అంగన్వాడి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, పలువురు ఆసక్తికరంగా తిలకించేలా చేశారు. గ్రామంలోని ప్రజానీకం దేశ గౌరవాన్ని చాటే విధంగా, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పంచాయతీ కార్యదర్శులు అజార్, కృష్ణమూర్తి, జ్యోతి, అరుణ శ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు అనంతలక్ష్మి, సుజాత , స్వరూప , చంద్రకళ ,శారద సరిత, సుజాత, రమాదేవి, పుల్లమ్మ, నాగమణి, రమాదేవి, ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: