CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల కేంద్రమైన చండ్రుగొండలో నూతనంగా నిర్మించిన షిర్డీసాయిబాబా, మహాలక్ష్మి ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ప్రత్యేకంగా దంపతులు కూర్చొని పూజలు నిర్వహించారు. టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి స్వీట్లను వేద పండితులు వివిఆర్కెమూర్తి కి అందజేశారు.వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మీ వ్రతం, నీరాజన మంత్ర పుష్పసమర్పన, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం( ఊరేగింపు), లక్ష్మీనారాయణ సాహిత మహా సుదర్శనహోమం కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వేదపండితుల మహోత్సవాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోణకండ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఉప్పుతల ఏడుకొండలు, ప్రతిష్ట కమిటీ బాధ్యులు చీదెళ్ళ పవన్ కుమార్, సంకా కృపాకర్, ముత్తా రెడ్డి, రాయల రమేష్, కుక్కడపు హరిబాబు, కడియాల నాగేశ్వరరావు, పెద్దిని వేణు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: