జూలూరుపాడు ఆగస్టు 5, (మన్యం మనుగడ ప్రతినిధి) మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయితీలో గల ( పీఎంహెచ్) పోస్ట్ మెట్రిక్ గిరిజన బాలికల కళాశాల వసతి గృహము, మరియు (ఏజిహెచ్ఎస్) ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలను శుక్రవారం ఫుడ్ ఇన్ స్పెక్టర్ టి వేణుగోపాల్ సందర్శించారు. విద్యార్థులకు వస్తున్నటువంటి సరుకులను, కూరగాయలను, సరుకులను భద్రపరిచే గదులను, పిల్లలు వాడే బోరు నీళ్లను, ఆర్ఓ ప్లాంట్ ను, పరిశీలించారు. రోజు వండి పెడుతున్న వంటల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు వంటలు వండించాలని, పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, వార్డెన్ తారా దేవి, పోస్ట్ మెట్రిక్ గిరిజన బాలికల కళాశాల వసతి గృహము వార్డెన్ తార తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: