గుండాల ఆగస్టు 27(మన్యం మనుగడ) విద్యారంగ సమస్యల కోసం పి డి ఎస్ యు నిరంతరం పోరాటం చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫా రాజేష్ అన్నారు శనివారం మండల కేంద్రంలో విద్యార్థులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం హాజరై అనంతరం వారు మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు అన్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కామన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: