మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నాడు తల్లిదండ్రుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీ విద్య కోసం పెద్దపీట వేసిందని,అన్నారు. 75వ వజ్రోత్సవ వేడుకల్లో ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ, వార్డెన్ ప్రమీల, ఉపాధ్యాయులు మహాలక్ష్మి, జ్యోతి, రాజ్యలక్ష్మి, సావిత్రి, బాలాజీ, పిడి ఆదినారాయణ, పిటి బాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: