మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపకార వేతనంకు అర్హత సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు నేర్పించిన క్రమశిక్షణ, అధ్యాపకుల అంకితభావం కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపకార వేతనం అర్హత సాధించారు. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం డిగ్రీ ,పీజీ లకు కలిపి 70 వేల రూపాయల ఉపకార వేతనమును అందించనుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శేష్ బాబు మాట్లాడుతూ, మా కళాశాల నుండి ప్రతి సంవత్సరం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉపకార వేతనం పొందుతున్నారని, ప్రైవేటు కళాశాలలకు దీటుగా బోధన తమ కాలేజీలో ఉందని తెలియజేశారు.ఉపకార వేతనంకు అర్హత సాధించిన సాగరిక(947) ,శోభన(944) ,సత్య దుర్గ(917) ,పావని(916) లను అభినందించారు. ఈ ఘనత సాధించుటకు కారకులైన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: