జూలూరుపాడు ఆగస్టు 8, (మన్యం మనుగడ ప్రతినిధి) మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆదివారం ఎడతెరిపి లేకుండా తెల్లవార్లు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. మండల పరిధిలోని గ్రామాలకు మండల కేంద్రానికి కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం రాళ్లవాగు, బేతాళపాడు పెద్దవాగు, నర్సాపురం తుమ్మలవాగు, నల్లబండబోడు సీతారామ ప్రాజెక్ట్ వరద నీటితో పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీటితోపాటు నర్సాపురం గోపాలకుంట, కాకర్ల ఎర్ర వాగు ప్రాజెక్ట్, పాపకొల్లు దండాల చెరువు, జూలూరుపాడు కప్పలకుంట, గుండెపుడి మేడికుంట, కొత్తూరు కూచికుంట, చెనగచెరువులు నీటితో నిండుకుండల్లా నిండాయి. పల్లెల్లోని అంతర్గత రహదారులన్నీ బురదమయంగా మారాయి.
Navigation
Post A Comment: