మన్యం మనుగడ కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామనికి చెందిన నాలి సత్యవతి (33)సం,,లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక ప్రభుత్వ వైద్యశాల పరిదిలోని ఉప్పాక గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ నందు ఏఎన్ఎం గా నిధులు నిర్వహిస్తున్నారు.ఆదివారం సెలవు కావడంతో తన స్వగ్రామైన సీతారాంపురం కు వచ్చి మరుసటి రోజు సోమవారం నిధులు నిర్వహణ కొరకు తన స్వగ్రామం నుండి పినపాక ఆసుపత్రికి బయలుదెరుతున్న క్రమంలో తోగ్గూడెం గ్రామ పంచాయతీపరిధిలోని తోగ్గూడెం,గోపాలరావు పేట గ్రామల మధ్యలోని ప్రధాన రహదారిపై పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ ని వెనుక భాగం నుండి బలంగా డికొనడంతో తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు గమనించి ఆమెను 108 వాహనంలో పినపాక ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందారని నిర్ధారణ చేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ఏరియా అస్పత్రికి తరలించి,పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆమె మరణంతో సితరంపూరం
గ్రామంలో విషాదశాలు అమలుకున్నాయి.
Post A Comment: