మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ సూచనల మేరకు టిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనారిటీ మండల అధ్యక్షులు షేక్ నయీమ్ మరియు అమెర్థ కాలనీ గ్రామానికి చెందిన యువజన విభాగం నాయకుడు ఇరుగు నాగారాజు కొద్ది రోజుల నుండి విషజ్వరాలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ వారిని పరమార్శించి, ధైర్యంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఇరువురికీ పండ్లను అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ గోదావరి నది వరద ముంపు సహయక చర్యల్లో పాల్గొని కొందరు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు ఇరువురిని పరమార్శించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు ప్రాణాలను పణంగా పెట్టి గోదావరి నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహయకచర్యలు చేపట్టిన యువతకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమెర్థ పంచాయితీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోదుగు వంశీ, టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్, యువజన విభాగం నాయకులు నజీర్ షోను, కన్నెబోయిన వేంకటేశ్వర్లు, రావుల అజయ్, మామిడాల శివ, డేవిడ్ రాజ్, డేగల కళ్యాణ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: