CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వీ ఆర్ ఏ ల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలి.వీ ఆర్ ఏ ల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ మండల కమిటీ

Share it:


 మన్యం మనుగడ, మంగపేట.             

 మంగపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటివంటి వి ఆర్ ఏ ల నిరవధిక సమ్మె 8వ, రోజు కి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పూర్తి మద్దతునిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ ఆధ్వర్యంలో ముఖ్య అధితిగా విచ్చేసి మాట్లాడుతూన్న మండల పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు మంగపేట మండల వి ఆర్ ఏ ల నిరవధ దీక్ష కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ అర్హత కలిగిన విఆర్ఏ లకు వెంటనే పదోన్నతి కల్పించాలి అని, 55 సంవత్సరాలు పైబడిన వి ఆర్ ఏ ల వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అని, అలాగే గత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వి ఆర్ ఏ లకు పేస్కెల్ ఇస్తా అని ఇప్పటి వరకు అమలుచేయలేదు వెంటనే వి ఆర్ ఏ లకు తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, రాష్ట్ర జిల్లా స్థాయి లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చారు అని వి ఆర్ ఏ లకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఏ పోరాటానికి అయిన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేవరకు పోరాటం చేయాలి అని మండల పార్టీ అధ్యక్షులు జయరామ్ రెడ్డి ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు,ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అయ్యోరి యన్నయ్య అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న,బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎస్కె హిడైతులా, మండల యూత్ గౌరవ అధ్యక్షుడు జంగం బానుచందర్, ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్, ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం, సీనియర్ నాయకులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, పొందేం నగేష్, భూర్గుల సతీష్,పునేమ్ ప్రశాంత్, ఊకె లాజర్,ఎట్టి సారయ్య, కట్ల శివరాజు,ఊకె అజయ్,కాస్ప ముకుందాం తదితరులు హాజరయ్యారు.

Share it:

TS

Post A Comment: