మన్యం మనుగడ, మంగపేట.
ఇటీవల గోదావరి వరద ముంపు కి గురైన మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన పది నిరుపేద కుటుంబాలకు హైదరాబాదు లోని విజయకృష్ణ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రవిపాటి పేరయ్య తన వంతు సాయంగా రూపాయలు 10000 విలువైన దుప్పట్లు చీరలు టవల్స్ నూతన వస్త్రాలను బహుకరించగా సోమ వారం జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వస్త్రాల కిట్లను నిరుపేద వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఆకినేపల్లి మల్లారం గ్రామం గోదావరి వరద ముంపు కి గురైందనే విషయాన్ని తాను విజయ్ కృష్ణ స్పైసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రవిపాటి పేరయ్య కి తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించి రూపాయలు 10000 ఆర్థిక సహాయాన్ని అందించటం హర్షనీయం అన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పేరయ్య గోదావరి వరద బాధితులకు తన వంతు సహాయం అందించటం అభినందనీయమని అకినేపెళ్లి మల్లారం గ్రామ ప్రజల తరఫున సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ డైరెక్టర్లు శెట్టిపల్లి తిరుపతిరావు శేషారెడ్డి ప్రసాద్ వరద బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: