గుండాల ఆగస్టు 26(మన్యం మనుగడ) మండలంలో ఏర్పాటు చేసుకోనున్న వినాయక మండపాలకు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏఈ రవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల విద్యుత్ అనుమతి కొరకు వన్ కెవికి 1560 రూపాయలు చెల్లించాలని అన్నారు ప్రతి కె.వి పెరిగే కొద్దీ 1560 రూపాయలు పెరుగుతూ పోతుంటాయని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేకుండా విద్యుత్ వాడకూడదని అన్నారు. వీలైనంతవరకు ఎల్ఈడి లైట్లు అనే వినియోగించాలని ఆయన సూచించారు. అనుభవిజ్ఞులైన ఎలక్ట్రిషన్ పర్యవేక్షణలో వైరింగ్ చేయించుకోవాలని చిన్నపిల్లలకు వైర్లు అందకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా కారణం చేత విద్యుత్ ప్రమాదం సంభవిస్తే పూర్తి బాధ్యత కమిటీ వారిదేనని ఆయన పేర్కొన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు
Navigation
Post A Comment: