CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యల నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు..

Share it:


  •  సమస్యల నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు.. 
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి.. 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి స్కూలు, ఆశ్రమ పాఠశాలలో సందర్శిస్తూ సమస్యలను తెలుసుకున్నారు ఇందులో భాగంగా రెండవ రోజు జీపు యాత్ర కార్యక్రమాన్ని కస్తూర్బా గాంధీ స్కూల్ నుండి ప్రారంభించారు ఈ యాత్రకి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం భూపేందర్ పాల్గొని వారు మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలోని  చదివే  అనేకమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ఇంకా అందించలేదని, సంక్షేమ హాస్టల్స్ లో సమస్యల విలియంగా ఉందని సరైన మెనూ పాటించడం లేదని అన్నారు డైలీ వేజ్ వర్కర్లు సమ్మెలో ఉన్నప్పుడు విద్యార్థులతోనే వంట చేయించారని పిల్లలు స్వయంగా వాష్ రూమ్ కడిగే పరిస్థితి ఏర్పడిందని పిల్లలందరికీ నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతూ  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపేందర్ ఉపాధ్యక్షులు నవీన్ జిల్లా నాయకత్వం సభ్యులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: