గుండాల/ఆళ్లపల్లి 26(మన్యం మనుగడ) ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సి ఆర్ టి ల వేతనాలను పెంచాలని టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని మర్కోడు ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా వారు పాఠశాలలలో పనిచేస్తున్న వారికి మాత్రం వేతనాలు పెంచడం లేదని అన్నారు. నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను సైతం ఇవ్వాలని ఆయన కోరారు. సి ఆర్ టి లకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఆయన కోరారు. మండలంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల కార్యదర్శి చాట్ల శ్రీనివాసరావు, టి బిక్షమయ్య, లాల్ సింగ్, నాగేశ్వరరావు, ఎర్రయ్య, వసంతరావు, జోగయ్య, రాంబాబు, వెంకన్న, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: