మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలో ఆయనను చంద్రుగొండ మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ కలిసి మండలంలోని సమస్యలపై ఆయనకు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ...పల్లెల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండలంలోని సీతయిగూడెం వెంగళరావు ప్రాజెక్ట్ అలుగు నిర్మాణం కోసం నిధులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.
Navigation
Post A Comment: