మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 23. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ హామీలు అమలుకోసం వాజేడు మండల కేంద్రంలో వీఆర్ఏ ల (30వ) రోజు నిరవధిక సమ్మె లో భాగంగా, *రాష్ట వీఆర్ఏల జాక్, పిలుపు మేరకు మోకాళ్లపై నిలుచొని అర్థ నగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు కుంధమల్ల,సురేష్ ఉపాధ్యక్షుడు తాటి బాలకృష్ణ మహిళా అధ్యక్షురాలు చుంచు అనూష మరియు కుందమల్ల, నాగరాజు, గజ్జల రాంబాబు, తెల్లం, శ్రీ లక్ష్మి, కావేరి బాలచంద్ర మూర్తి, జాడి , జాడి తిరుపతి, కాటా తిరుపతమ్మ, వేల్పుల ఉదయ అట్టం, కృష్ణారావు, షేక్ నన్నేమియా,పాల్గొన్నారు.
Post A Comment: