మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : భవిష్యత్తరాల కోసం అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీశాఖ రేంజర్ చలమల శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం మద్దుకూరు బీట్ పరిధిలోని అటవీప్రాంతంలో ప్లాంటేషన్ పనులను ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోడుదారుల ఆందోళనలతో ఆగిపోయిన ప్లాంటేషన్ పనులను ఈరోజు పూర్తి చేయడం జరిగినదని, 20 ఎకరాలకు గాను 5 ఎకరాలు పూర్తి అయ్యాయన్నారు. అడవులను ఎవరికి వారే సంరక్షించాలన్నారు. అడవుల్లో చెట్లు నరకడం,పొడు పేరుతో ధ్వంసం చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు సైతం అడవుల సంరక్షణ పై గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: