మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గత నెల గోదావరి వరదల కారణంగా ముంపు గురైనటువంటి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల సహాయం అందలేదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ ప్రతాప్ వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ చంద్రయ్య మాట్లాడుతూ తూరుబాక బండారుగూడెం వైట్నగరం రేగుబల్లి దుమ్ముగూడెం డబుల్ బెడ్ రూమ్ కాలనీ కాశీనగనారం పర్ణశాల రోడ్డు సున్నం బట్టి వరద ముంపుకు గురైనటువంటి అసలైన బాధ్యులకు నష్టపరిహారం అందకుండా, వరద ముంపు కానటువంటి వ్యక్తులకు నష్టపరిహారం అందిందని ఈ తప్పుడు సర్వే చేసినటువంటి రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంటనే వరద బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల ఇవ్వాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చందు శ్రీను వీరస్వామి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: