మన్యం టీవీ దుమ్ముగూడెం ::
విద్య తోనే రేపటి తరానికి భవిష్యత్తుని తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఈరోజు మండల వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మీటింగ్ కు తోగూడెం ఎంపీపీ పాఠశాల జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ రేసు లక్ష్మి పాల్గొన్నారు అలానే సీతారాంపురం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ సున్నం సమ్మయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో చేరుకోవాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు పిల్లలు రోజు పాఠశాలకు వచ్చి విద్యావినియాలు అమలుపరచుకొని కనీస వారి సామర్థ్యాలు నేర్చుకోవాలని రాయడం చదవడం మాట్లాడడం రావాలని అలానే తల్లిదండ్రులు ప్రతినెల నిర్వహించే మీటింగ్ కు హాజరుకావాలని కోరారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని కోరారు పలు పాఠశాలలో సుందర స్వప్నంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వంశీకృష్ణ, చింతగుప్ప సర్పంచ్ కట్టం కృష్ణ, ఉపాధ్యాయులు బి రవి నరేందర్ మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులు విద్య కమిటీ చైర్మన్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: