మన్యం టీవీ దుమ్ముగూడెం ::
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30న ములకలపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు జరిగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు ఎలమంచి రవికుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మండలంలోని స్థానిక వైయస్ భవన్లో జరిగిన రైతు సంఘం ముఖ్య నాయకులు సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు సరైన ధర ప్రకటించడం లేదని కేరళ ప్రభుత్వం తరహాలో మన దగ్గర కూడా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ములకలపల్లి లో జరిగే మహాసభలో రైతంగ సమస్యలపై అనేక తీర్మానాలు చేస్తామని, అలానే పోడు రైతు సమస్యలను సత్వరమే పరిశీలించి సాగులోన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కొడాలి లోకేష్ బాబు, బొల్లి సూర్యచంద్రరావు, శ్రీనుబాబు, లక్ష్మయ్య, రాంబాబు, గణేష్ రెడ్డి, వంశీకృష్ణ, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: