బాధిత మహిళలకు మేము అండగా ఉంటాం దిశ మహిళా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి -ఏయస్పి రోహిత్ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన భారతి -మహిళా రక్షణ ధ్యేయంగా పని చేస్తాం -భారతి
మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ డియస్పి కార్యలయం మరియు భద్రాచలం ఎయస్పి కార్యాలయాలలో నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన డియస్పి సత్యన్నారాయణ రావు, భద్రాచలం ఏయస్పి రోహిత్ రాజులను మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చలు అందజేయడం జరిగిందని అశ్వారావుపేట ఎంపీటీసీ, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు మైనారిటీ బాలికలు అనేక సమస్యలతో సతమాతవవుతున్నారని జిల్లా పర్యటన లో భాగంగా మహిళా సమస్యలపై అధికారులను కలవడం జరిగిందని వారు స్పందించి మహిళల రక్షణకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అభయమిచ్చారని వారు అన్నారు. అలాగే అప్పుడే పుట్టిన పసికందునుండి వృద్ధ మహిళలకు ఏ సమస్య వచ్చిన దిశను ఆశ్రయించవచ్చునని, మహిళలకు అండగా, రక్షణగా ఉంటామని వారికీ దిశ సేవలు అందించడానికి జిల్లాలో ప్రతి పట్టణంలో దిశ సభ్యులు ఉన్నారని భారతి అన్నారు.
Post A Comment: