మన్యం మనుగడ ప్రతినిధి - చండ్రుగొండ :
మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రుల ముఖ్య సమావేశం ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనంద్ అధ్యక్షతన, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీత అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.... పాఠశాలలో మూత్రశాల లేకపోవడంతో ప్రాంగణం ప్రహరీ గోడ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న సమస్యపై ప్రధానోపాధ్యాయులకు కు వివరించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మూత్రశాల నిర్మించాలన్నారు. ఇంకా మంచి నీటి సమస్య గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ ఉపసర్పంచ్ బాబురావు, ఎంపీటీసీ దారా బాబు, ఎస్ఎంసి చైర్మన్ బత్తుల లక్ష్మయ్య, పాఠశాల కోఆప్షన్ సభ్యుడు సురా వెంకటేశ్వర్లు, మణికంఠ, రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: