మన్యం మనుగడ/వాజేడు: ఆగస్టు16: 75 ఏళ్ల స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మదినిండా దేశభక్తితో ఉదయం 11.30 గంటలకు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని జగన్నాపురం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి, పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, ఎంపీడీవో విజయ, డిప్యూటీ తహశీల్దార్, సర్వర్ పాషా , సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుపతిరావు, ఆర్ ఐ,రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల రామకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూసం నరేష్ కుమార్, వైస్ ఎంపీపీ గొంది రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విక్రాంత్, పాఠశాల, కళాశాల విద్యార్థులు, కార్మిక, ప్రజా, వివిధ సంఘాలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో అధికారులు, సిబ్బంది ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతం జనగణమన గీతపాలన చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పలు గ్రామాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ప్రధాన రహదారులపై ర్యాలీగా వచ్చి జాతీయ గీతాలాపనలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటి చెప్పారు.
Post A Comment: