మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల కేంద్రమైన లక్ష్మీ నగరం గ్రామంలో డిజిటల్ ఫోటో స్టూడియో నిర్వహిస్తూ తన కళాత్మక తో ఫోటోగ్రఫీ డిజైనర్ రాణిస్తున్న పూదోట కృష్ణవేణి కి భద్రాచలం పట్టణానికి చెందిన కళాంజలి ఫ్యాషన్ డిజైనర్స్ నిర్వాహకురాలు కర్ర సరళ రెడ్డి స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం శాలువాతో సన్మానించారు. చిన్న బండిరేవు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కుటుంబ భారాన్ని మోస్తూ నే తాము నిర్వహిస్తున్న పనుల్లో సైతం నైపుణ్యాలను పెంపొందించుకుంటూఎంతో మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా కలయిక ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు మునుముందు కూడా తాము చేస్తున్న వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకుని మహిళలుగా సమాజానికి, కుటుంబానికి ఆదర్శంగా ఉంటూ పదిమందికి మార్గదర్శకులుగా ఉందా మంటూ ఒకరికి ఒకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Post A Comment: