CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..సాయిబాబా, మహాలక్ష్మి, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టలు..

Share it:

   


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల కేంద్రమైన చండ్రుగొండలొ నిర్మించిన నూతన ఆలయాలలైనా సాయిబాబా, మహాలక్ష్మి,ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం మహాలక్ష్మి వార్ల యంత్ర, విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, మైసమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల యంత్ర, శివలింగ ప్రతిష్ట, షిర్డీసాయినాధుని యంత్ర,విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు వేదపండితుడు వివిఆర్కె మూర్తి ఆధ్వర్యంలో పండితుల ప్రత్యేకపూజ నడుమ ప్రతిష్టించారు. ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ భానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, జడ్పీటీసీ కోణకండ్ల వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ బోజ్య నాయక్,మేడా మోహన్ రావు, గాదె లింగయ్య, ఆలయ విగ్రహ ప్రతిష్ట బాద్యులు చీదెళ్ళ పవన్ కుమార్, నాగిరెడ్డి, పేదిని వేణు, సంక కృపాకర్, సూర వెంకటేశ్వరరావు, కడియాల నాగేశ్వరరావు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: