మన్యం టీవీ దుమ్ముగూడెం ::
రోడ్డు పనుల మరమ్మతుల కోసం తరలిస్తున్న రెండు వాహనాలను మావోయిస్టులు అడ్డుపడి తగలబెట్టిన సంఘటన సోమవారం ఉదయం 10 ఎలకనగూడెం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి చతిస్గడ్ రాష్ట్రం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలకనగూడెం సమీపంలో కాంట్రాక్టర్ పాల్వంచకు చెందిన అమర్ రోడ్డు పనుల కోసం ట్రాలీపై తరలిస్తున్న ప్రోక్లేయర్ తగలబెట్టారు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరమ్మత్తులు చేసేందుకు పెదనాలబెల్లి నుండి చంద్రుగొండ గ్రామం దాటి ముందుకు వెళ్తుండగా ఎలకనగూడెం గ్రామానికి పోలీస్ క్యాంపు కిలోమీటర్ల దూరంలో అడ్డుపడి వాహనాన్ని ఆపి అందులో ప్రయాణిస్తున్న 7 మందిని కిందకి దింపి డ్రైవర్ని పిలిచి డిజిల్ ట్యాంకు మూత తీయమని మావోయిస్టు చెప్పగా తను నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో మావోయిస్టు డ్రైవర్ని కొట్టారు. అనంతరం డీజిల్ తో రెండు వాహనాలను తగలబెట్టారు ఈ సంఘటనకు ముందు సంతకు వెళ్తున్న వ్యాపారస్తుల దగ్గర నుంచి నిత్యవసర సరుకులు మందు బాటిళ్లు ఎత్తుకెళ్లినట్టు వ్యాపారస్తులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనలో మొత్తం 30 మంది పైగా మావోయిస్టులు పాల్గొని అందులో 10 మంది రోడ్డుపైకి వచ్చి వాహనాన్ని ఆపారని అందులో 4 మంది మాస్కులు ధరించి ఒక మావోయిస్టు వద్ద తుపాకి మిగతా వారి దగ్గర మరణఆయుధాలు ఉన్నట్టు తెలియజేశారు. అయితే తెలంగాణ-చతిస్గడ్ సరిహద్దు గ్రామాల్లో ఈ ఘటన తర్వాత అలజడి మొదలైంది గత మూడు నెలల క్రితం ఇదే కాంట్రాక్టర్ చెందిన లారీలను తగలబెట్టిన సంఘటన దృశ్య కాంట్రాక్టర్ అమర్ లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడుతున్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుక్మ ఎస్పి సునీల్ శర్మ మాట్లాడుతూ మావోయిస్టు అత్యంత ప్రభావితమైన ఏరియాలో ఎటువంటి పోలీస్ సెక్యూరిటీ లేకుండా నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వాహనాలు తరలించారని మాకు సమాచారం ఇస్తే పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసే వాళ్ళమని ఎస్పీ ధ్రువకరించారు.
Post A Comment: