జూలూరుపాడు ఆగస్టు 5 (మన్యం మనుగడ ప్రతినిధి) వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు రాందాసు నాయక్ ఆధ్వర్యంలో
శుక్రవారం ఎఐసీసీ మరియు టిపిసిసి, టిసీఎల్పీ పిలుపు మేరకు కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపై వైరాలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తరలిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాక్, చాపలమడుగు నరసింహారావు, మంద బాబు, తాళ్లూరి అచ్చయ్య, గుగులోత్ శ్రీనువాస్, కొలిపాక శ్రీనివాస్, బోడా వీరునాయక్, గుగులోత్ రాంబాబు, సామ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: