మన్యం టీవీ చర్ల:
ఈరోజు చర్ల మండలం లో గోదావరి వరద ముంపుకు గురైన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం కింద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది.ఇచ్చిన మాట ప్రకారం వరద బాధితుల వారి బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరిగింది. చర్ల మండలంలో ప్రతి పంచాయతీలో కోంత మంది పేర్లు గల్లంతయి నందున ఈరోజు చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చి రీ సర్వే చేసి అర్హులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్,పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు,అజీజ్, తోటమల్ల రవి, కొంబతిని రాము, రావుల కిషోర్, తడికెల బుల్లెబ్బాయి, తడికెల చందు, ముత్యాల కిరణ్, రావుల సంపత్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు పాల్గొనడం జరిగింది.
Post A Comment: